తేజస్వి ను అభినందించిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు :


 పద్మనాభం: సోమవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన బి.తాళ్లవలస పాఠశాలలో చదివిన, అదే గ్రామానికి చెందిన పైల జగన్నాధం, యశోద ల కుమార్తె పైల తేజస్వి ను తెలుగునాడు విద్యార్థి సమైక్య భీమిలి నియోజకవర్గ ఉపాధ్యక్షులు కంటుబోతు సుమంత్ నాయుడు ఆధ్వర్యంలో అభినందించారు. 

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న టిఎన్ఎస్ఎఫ్ భీమిలి నియోజకవర్గ అధ్యక్షులు బోని సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భీమిలీ నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజాబాబు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగిందని, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి, 578 మార్కులు సాధించటం సాధారణ విషయం కాదని కొనియాడారు. భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదివి , తను అనుకున్నది సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థి నాయకులు తేజస్వీ కు శాలువా కప్పి, స్వీట్స్ తినిపించి, తనకు, తనను కన్న తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి చరణ్, శివ, కోరాడ అతిధి తదితరులు పాల్గొన్నారు.