సరస్వతి పుత్రికలకు శుభాకాంక్షలు తెలిపిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు :


 ఆనందపురం: మండలంలోని పదవ తరగతి ఫలితాల లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సరస్వతి పుత్రికలను తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజాబాబు గారి ఆదేశాల మేరకు తెలుగునాడు విద్యార్థి సమైక్య నియోజకవర్గ ప్రధానకార్యదర్శి కోరాడ వైకుంఠ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో అత్యధిక మార్కులు సాధించిన ఆనందపురం హై స్కూల్ లో చదువుతున్న, అదే గ్రామానికి చెందిన మందపాక కృష్ణరావు, హారిక ల కుమార్తె మందపాక యమున ను, సరస్వతీ విద్యా విహార లో చదువుతున్న, నగరపాలెం గ్రామానికి చెందిన పిల్లా శ్రీనివాస్ రావు, పుష్పలత ల కుమార్తె పిల్లా రితిక లను టిఎన్ఎస్ఎఫ్ నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో మండల ఐ.టీడీపీ అధ్యక్షులు సారికి విజయ్, టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి షినగం సోమునాయుడు, నియోజకవర్గ కార్యదర్శి బసన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.