జనసేవ న్యూస్ : భీమునిపట్నం
- ఈ నెల 28న జర్నలిస్టులకు పునఃశ్చరణ తరగతులు
- ఎస్.సి.ఆర్. డబ్ల్యూ.ఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సరికొత్త పంథాలో సభ్యులకు నూతన గుర్తింపు కార్డులను రూపొందించింది . ఈ మేరకు భీమిలి యూనిట్ సభ్యులకు సోమవారం ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ చేతుల మీదుగా అసోసియేషన్ ఐడీ కార్డులను అందజేసారు. ఈ సందర్బంగా అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే ఎస్సిఆర్డబ్ల్యూఏ నిజమైన సభ్యులను గుర్తించడానికి రెండు బార్ కోడ్ లతో కూడిన ఐడీ కార్డులను తయారు చేయడం జరిగిందన్నారు. సభ్యుల సంక్షేమమే ద్యేయంగా కొత్త ప్రణాళికలను రూపొందించి కార్యక్రమాలను సిద్ధం చేశామని అన్నారు .. ముఖ్యంగా సభ్యులకు వృత్తి నైపుణ్యత పెంపొందించడానికి ఈ నెల 28న పునఃశ్చరణ తరగతులను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు..ప్రతీ ఒక్కరూ పునఃశ్చరణ తరగతులను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవలన్నారు.
అసోసియేషన్ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి సహకరిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు . ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్),ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లాజీరావు,భీమిలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమణ ప్రసాద్ , కార్యదర్శి కిషోర్, కోశాధికారి జి. శ్రీనివాసరావు, సభ్యులు మోహన్ రావు, కుమార్, పీ.శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భీమిలి పట్టణం రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్
https://ift.tt/CvT0psw లోకల్, ap, Bheemili, journalists https://ift.tt/6Vbl1iT