జనసేవ న్యూస్ విశాఖపట్నం:
కాలుష్య నియంత్రణకు, హరిత వాతావరణానికి అందరూ ప్రజా రవాణా వ్యవస్థనే ఉపయోగించాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కోరారు. ప్రతి సోమవారం జీవీఎంసీ ఉద్యోగులoతా తమ సొంత వాహనాల్ని వదిలి కార్యాలయానికి రావాలన్నారు. జీవీఎంసీకి వచ్చే వారంతా కూడా అలాగే చేయాలని కోరారు.
సోమవారం ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి బస్టాపు వరకు వచ్చి అక్కడి నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
అనంతరం డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో పాల్గొని బాధితుల సమస్యలు విన్నారు. మూడు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
జనసేవ న్యూస్
https://ift.tt/8bf1dMZ ప్రెస్ నోట్, ఆంధ్ర, లోకల్, ap, janasena, mayor, public transportation, TDP, visakhapatnam, ysrcp https://ift.tt/0YA8Xao