పదవ తరగతి విద్యార్థులను సన్మానించిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు :


 ఆనందపురం : మండలంలోని పదవ తరగతి ఫలితాల లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సరస్వతి పుత్రికలను తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజాబాబు గారి ఆదేశాల మేరకు తెలుగునాడు విద్యార్థి సమైక్య నియోజకవర్గ నాయకులు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో అత్యధిక మార్కులు సాధించిన ఆనందపురం హై స్కూల్ లో చదువుతున్న, అదే గ్రామానికి చెందిన మందపాక కృష్ణరావు, హారిక ల కుమార్తె మందపాక యమున ను, గొట్టిపల్లి హై స్కూల్ లో చదువుతున్న ఏనుగుపాలెం గ్రామానికి చెందిన వెన్ని రమణ, రామలక్ష్మి కుమార్తె వెన్ని ప్రమీల, సరస్వతీ విద్యా విహార లో చదువుతున్న, నగరపాలెం గ్రామానికి చెందిన పిల్లా శ్రీనివాస్ రావు, పుష్పలత ల కుమార్తె పిల్లా రితిక లను టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, మాజీ సర్పంచ్ లు కోరాడ వెంకటరావు, కోరాడ నాయుడు బాబు,  ఎంపీటీసీ సభ్యులు దొంతల కనకరాజు, మండల తెలుగు యువత అధ్యక్షులు యర్ర బంగారునాయుడు (బన్నీ), హై స్కూల్ చైర్మన్ వెన్ని నారాయణ రావు,  కోరాడ శంకర్, కోరాడ తౌడుబాబు, పలిన రమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు తడివాడి శివ సమక్షంలో  శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. 
ఈ సందర్భంగా తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ భీమిలీ నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజాబాబు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగిందని, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి, మండల స్థాయి లో  మార్కులు సాధించటం సాధారణ విషయం కాదని కొనియాడారు. భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదివి , తను అనుకున్నది సాధించాలని ఆకాంక్షించారు. ఆనందపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, గొట్టిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సన్యాసిరావు గారికి మరియు పాఠశాలల సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు బోని సురేష్, ప్రధాన కార్యదర్శి కోరాడ వైకుంఠ రావు, ఉపాధ్యక్షులు కంటుబోతు సుమంత్ నాయుడు, కార్యనిర్వాహణ కార్యదర్శి బసన అప్పాజీ, అధికార ప్రతినిధి అవనాపు రవి, మండల ఐ.టీడీపీ అధ్యక్షులు సారిక విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.