భీమిలి పట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి సుందర్ సింగ్ ఎన్నిక

భీమునిపట్నం జనసేవ న్యూస్ :- భీమిలి పట్నం బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు శుక్రవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా పి సుందర్ సింగ్, ఉపాధ్యక్షునిగా బి సూర్యనారాయణ, కార్యదర్శిగా పి ఎస్ ఎల్ కె భరద్వాజ ,సహాయ కార్యదర్శిగా ఎ వర్మరాజు, కోశాధికారిగా శ్రీమతి డి . కనకమహాలక్ష్మి, 
కార్యవర్గ సభ్యులుగా ఆర్ కరుణాకర్, బి అప్పలరాజు, బి అరుణ కుమారి, ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి యస్ సురేష్ రెడ్డి శుక్రవారం మీడియాకు తెలియజేశారు .
ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన సుందర్ సింగ్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించిన న్యాయవాదుల అందరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాని అన్నారు అలాగే న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు బార్ సంక్షేమానికి శక్తివంచన పాటు పడతా నన్నారు. 

ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యుల ను న్యాయవాదులు అభినందించారు.

భీమిలి రిపోర్టర్
 పి శ్రీనివాసరావు