ఆనందపురం జనసేవ న్యూస్ :
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి) ఇన్స్పెక్టర్ వి.రామకృష్ట మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం మండలంలో సెబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ తన సిబ్బందితో సొమవారం విస్తృత దాడులు నిర్వహించగా మండలంలోని పొడుగుపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని 07(180ml) మద్యం సీసాలు తో పట్టుకొని అదే గ్రామానికి చెందిన రెండో వ్యక్తిని 13(180ml) మద్యం సీసాలు తో పట్టుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ దాడులలో సెబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ ఎస్ఐ పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్